Sunday, May 5, 2024

Counter – రాష్ట్ర‌ప‌తితో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్స‌వం … స్పందించిన గ‌వ‌ర్న‌ర్

చెన్నై: పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోడీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు.. చెన్నైలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, ”తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారు… సచివాలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించలేదు. నాకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ అంశం ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. రాష్ట్రపతే ప్రారంభించాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదని అంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా!” అని ఆమె వ్యాఖ్యానించారు.. ఆమె వ్యాఖ్యాల ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement