Saturday, May 4, 2024

40 లక్షల లంచం డబ్బుతో పట్టుబడ్డ డిప్యూటీ కలెక్టర్.. వలవేసి పట్టుకున్న ఏసీబీ

40 లక్షల లంచం సొమ్ముతో వెళ్తున్న ఓ డిప్యూటీ కలెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు అవినీతి నిరోధక విభాగం ఇవ్వాల (బుధవారం) తిరుచ్చి జిల్లా ఆది ద్రావిడర్ సంక్షేమ శాఖ డిప్యూటీ కలెక్టర్ శరవణకుమార్‌ను రూ. 40 లక్షల నగదుతో పట్టుకుంది. శరవణకుమార్ డబ్బుతో విల్లుపురం మీదుగా చెన్నై వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వలవేసి పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆది ద్రావిడర్ సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి లంచం వసూలు చేస్తున్నట్లు విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో మాటు వేసిన పోలీసులకు విల్లుపురం మీదుగా చెన్నైకి భారీగా డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

పక్కా సమాచారం మేరకు ఆది ద్రావిడ సంక్షేమ శాఖ డిప్యూటీ కలెక్టర్‌ వాహనాన్ని అడ్డగించగా కారులో రూ.40 లక్షల నగదు లభ్యమైంది. డీవీఏసీ అధికారులు నగదును స్వాధీనం చేసుకుని డిప్యూటీ కలెక్టర్ శరవణకుమార్‌తో పాటు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement