Thursday, May 16, 2024

క‌రోనాతో త‌మిళ ద‌ర్శ‌కుడు మృతి..

క‌రోనా ఇంకా కోర‌లు చాస్తూనే ఉంది. ఈ మ‌హమ్మారికి ఎంతో బ‌లి అయ్యారు..అవుతూనే ఉన్నారు. కాగా క‌రోనా బారిన ప‌డి ప్ర‌ముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్‌ఎన్‌ ఆర్‌ మనోహర్‌ మృతి చెందారు. ఆయన వయస్సు… 54 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా ఆయన చెన్నై లోని ఓ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు కొన్ని రోజుల కింద కరోనా పాజిటిగ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. గత 20 రోజులుగా కరోనా తో పోరాడుతూ… చివరికి నేడు మృతి చెందారు. మనోహర్‌ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదంలోకి వెళ్లింది. మ‌నోహ‌ర్ మృతికి ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement