Tuesday, April 30, 2024

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపు పొందిన కమెడియన్ గణేశన్ కొంత కాలంగా అనారోగ్యంతో బాఢపడుతూ సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించాడు. ఆయనకు ఓ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తేపట్టి గణేశన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతడు అజిత్ లాంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించాడు. అజిత్ హీరోగా నటించిన ‘బిల్లా-2’లో గణేశన్ నటించాడు. అలాగే కొన్ని చిన్న సినిమాలు కూడా చేశాడు. తెలుగులో డబ్ అయిన ‘రేణిగుంట’ సినిమాలో ప్రధాన కమెడియన్‌గా నటించాడు. అతడికి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే ఆయన చికిత్స తీసుకుంటున్నాడు. ఉన్నట్లుండి ఆరోగ్యం విషమించడంతో ఈరోజు ఉదయం మరణించినట్లు వైద్యులు తెలిపారు. చాలా చిన్న వయసులోనే గణేశన్ కన్నుమూయడం తమిళ ఇండస్ట్రీకి తీరనిలోటు అంటూ దర్శకుడు శ్రీను రామస్వామి ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement