Tuesday, May 14, 2024

ఇంటి కోసం డబ్బు దాచుకున్న విశాల్… పునీత్ లెగాసీ కోసం..

తమిళ స్టార్ హీరో విశాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలినడకన తిరుమలకు వచ్చిన విశాల్… రాత్రి పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. బుధవారం తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విశాల్ మీడియాతో మాట్లాడారు. శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టు ఉందని అన్నారు. పునీత్ రాజ్‌కుమార్‌ మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని తెలిపారు. పునీత్ రాజ్‌కుమార్ ప్రారంభించిన సామాజిక కార్యక్రమాలను తాను కొనసాగిస్తానని విశాల్ స్పష్టం చేశారు. ఇంటిని కొనడానికి దాచి పెట్టుకున్న డబ్బును దీనికోసం ఖర్చు చేస్తానని ప్రకటించారు. ఇళ్లు ఎప్పుడైనా కొనవచ్చని, పునీత్ లెగాసీని కొనసాగించడం అవసరమని తెలిపారు. పునీత్ మొదలు పెట్టిన సామాజిక కార్యక్రమాలు ఎక్కడా ఆగకూడదని తాను కోరుకుంటున్నానని విశాల్ చెప్పారు.

కాగా, విశాల్ హీరోగా నటించిన ఎనిమి సినిమా దీపావళి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఆర్య ఇందులో కీలక పాత్రను పోషించారు.

ఇది కూడా చదవండి: హుజూరాబాద్ నిరూపించింది.. ఏపీలోనూ అలా జ‌ర‌గాల‌ని ఆశిద్దాం

Advertisement

తాజా వార్తలు

Advertisement