Sunday, April 28, 2024

Delhi | ఆప్ ఎంపీపై సస్పెన్షన్ ఎత్తివేయాలి.. బీఆర్‌ఎస్ ఎంపీల డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆప్ ఎంపీ సస్పెన్షన్ అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్ ఎంపీలు నినదించారు. సోమవారం రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురై పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగిన ఆప్ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ సింగ్‌ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావుతో పాటు ఇతర బీఆర్‌ఎస్ ఎంపీలు సాయంత్రం 6:30 గంటల నుంచి ఆయనతో పాటు ధర్నాలో కూర్చుకున్నారు. సంజయ్ సింగ్ సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండించారు. సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement