Tuesday, May 7, 2024

అర్హులందరికీ ఆసరా పింఛన్లు-ఎమ్మెల్యే దాసరి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో 25, నిట్టూరు లో 57 మందికి మొత్తం 82 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో 46లక్షల కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నారన్నారు.గత పాలకుల హయాంలో వృద్ధులకు 200 రూపాయల పింఛన్లు మాత్రమే ఇచ్చే వారని, కేసీఆర్‌ సీఎం అయ్యాక పదింతలు పెంచి 2016 రూపాయలు ఇస్తున్నారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంత భారీగా పింఛన్లు లేవన్నారు.

అభివృద్ధిలో తెలంగాణను మేటిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు కేసీఆర్ అని, అర్హులైన ప్రతి పేదవారికి పెన్షన్‌ తప్పక ఇస్తామ‌న్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని, ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,వైస్ ఎంపీపీ రాజయ్య,సర్పంచ్ లు రిషికరాజేందర్, కవితవెంకట్ రాజం,వేల్పుల కుమార్, బండారి మల్లయ్య, మల్లికార్జున్ రావు, కుమార్, ప్రవీణ్, వేణుగోపాల్ రావు, ఆకుల శ్రీనివాస్, సంపత్ రావు, సంపత్ రెడ్డి, నంబయ్య, లక్ష్మణ్, హరీష్, సంతోష్ రావు తెరాస ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement