Wednesday, May 1, 2024

డివైడ‌ర్ పై నిద్రిస్తున్ వారిపైనుండి దూసుకెళ్లిన లారీ – న‌లుగురు మృతి-ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

డివైడ‌ర్ పై నిద్రిస్తున్న వారిపై నుండి ఓ లారీ దూసుకెళ్ళింది.ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెందారు. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ సంఘ‌ట‌న ఢిల్లీలోని సీమాపురి డీటీసీ డిపో వద్ద చోటు చేసుకుంది. కాగా ఈ డిపో వ‌ద్ద‌ రెట్‌లైట్‌ పడింది. అయితే దానిని పట్టించుకోకుండా వేగంగా వెళ్లిన లారీ.. అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వారిమీద నుంచి వెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.మరొకరు దవాఖానకు తరలిస్తుండగా చనిపోయారని, ఇంకొకరు చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మరణించాడని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయని, వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement