Monday, April 29, 2024

క్షేమంగా తిరిగొచ్చారు.. విద్యార్థులను పరామర్శించిన చైర్మన్ మమత

ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు క్షేమంగా తిరిగి వచ్చారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న పెద్దపల్లి పట్టణానికి చెందిన సహేర్ ఫాతిమా, సయ్యద్ ఖలీద్ ఒమన్ లు క్షేమంగా తిరిగి వచ్చారు. విద్యార్థులను పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. యుద్ద వాతావరణంలో బిక్కుబిక్కుమంటూ గడపామని, తెలంగాణ ప్రభుత్వం చొరవతో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చామని విద్యార్థులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లకు విద్యార్థులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. చైర్పర్సన్ వెంట కౌన్సిలర్ లు మాధవి, కార్తిక్ తో పాటు పలువురు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement