Friday, May 17, 2024

Vande Bharat Express – ముజఫర్‌నగర్ లో రాళ్ల దాడి – పగిలిన అద్దాలు

ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ రైల్ పై రాళ్ల దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.

కోచ్ ఈ-1 సీటు నెంబర్ 13-14 ప్రాంతంలో దాడి జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. అయితే, ఈ రాళ్ల దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రాళ్ల దాడికి రైలు అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. రైలులోని కొందరు ప్రయాణికులు దీనిని వీడియో తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement