Tuesday, May 14, 2024

భారీలాభాల్లో స్టాక్‌మార్కెట్లు, సెన్సెక్స్‌ 1047.. నిఫ్టీ 311పాయింట్లు అప్‌

అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీచడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. యూఎస్‌ పెడరల్‌ రిజర్వ్‌ 2018 తర్వాత తొలిసారి పాలసీ రేటును పెంచడం, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చల పురోగతితో గురువారం సెన్సెక్స్‌ 1047పాయింట్లు పెరిగి 57,863 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 311పాయింట్లు పెరిగి 17,287కి చేరుకుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ 1.36శాతం, స్మాల్‌క్యాప్‌ షేర్లు 1.02 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 2.03, నిఫ్టీ బ్యాంక్‌ వరుసగా 1.95శాతం పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ 2.75శాతం పెరిగి రూ.2,355.10 చేరుకుని నిఫ్టీలో టాప్‌ గెయినర్‌గా అగ్రస్థానంలో నిలిచింది.

యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 510 కంపెనీల షేర్లు క్షీణించగా 2,101కంపెనీల షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ లాభాలబాటలో పయనించాయి. మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు కూడా తగ్గడం మార్కెట్‌కు సానుకూలంగా మారింది. క్రూడ్‌ ఆయిల్‌ బ్రెంట్‌ బ్యారెల్‌ 97.96 డాలర్లు ఉండగా డబ్ల్యూటీఎ బ్యారెట్‌ 95.04 డాలర్లుగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement