Saturday, May 18, 2024

దుకాణాల్లో చోరీలు చేస్తున్న నిందితులు అరెస్ట్

వెస్ట్ క్రైమ్, (ప్రభ న్యూస్) : గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీల‌కు పాల్పడుతున్న దొంగలను నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నివాసముండే ఎస్.కె మమ్మద్ బైక్ మెకానిక్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన మహమ్మద్ తన స్నేహితుడైన ఒక మైనర్ బాలుడితో జతకట్టి జల్సాల కోసం దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో గుంటూరు అర్బన్ పరిధిలో పలు దుకాణాల మీద పగలు రెక్కీ నిర్వహించి రాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతున్నారు.

ఈ తరుణంలో నల్లపాడు ఎస్ హెచ్ ఓ ప్రేమయ్య ఆధ్వర్యంలో ఎస్సై కిషోర్ చాకచక్యంగా తన సిబ్బందితో దొంగతనాలకు పాల్పడుతున్న ఎస్ కె మహమ్మద్ ను, మైనర్ బాలుడిని గురువారం అరెస్టు చేశారు. వారి నుండి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారని నల్లపాడు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement