Friday, May 3, 2024

పూరీ జగన్నాథుని క్షేత్రంలో తొక్కిసలాట.. ప‌లువురికి గాయాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిస‌లాట చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మయూర్‌భంజ్ జిల్లాలోని హ్రుదానంద హైస్కూల్‌కు చెందిన 70 మంది విద్యార్థులు పూరీ ఆలయ సందర్శనకు వెళ్లారు. ఆల‌య మెట్లు ఎక్కుతుండగా బాలికలు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. దీంతో విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement