Saturday, May 4, 2024

బీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో పెంచిన ఎస్టీ రిజర్వేషన్లు.. అమలుకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెంచిన ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయనుంది. బీఈడీ, బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల ప్రవేశాల్లో అమలు చేయనున్నట్లు ఈమేరకు రెండు జీవోలను విడుదల చేసింది. వృత్తిపరమైన ఈ కోర్సుల్లో ఎస్టీలకు గతంలో ప్రభుత్వం 6 శాతం నుంచి 10 శాతంకు పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం ఈమేరకు ఈ కోర్సుల్లో రిజర్వేషన్‌ పెంపు అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్టీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement