Sunday, April 28, 2024

SRK vs PBKS | హైద‌రాబాద్‌, పంజాబ్ ఫైట్‌.. మ‌రికాసేప‌ట్లో ఉప్ప‌ల్ స్టేడియంలో మ్యాచ్‌

ఇవ్వాల మరికొద్ది సేపట్లో (రాత్రి 7.30 గంటల నుంచి) ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1500 మంది పోలీసులు, 340 సీసీ కెమెరాలు, షీ టీమ్స్, మఫ్టీలో పోలీసులు, క్విక్ రియాక్షన్ టీంలతో భారీ నిఘా ఏర్పాట్లు చేశారు.

ఇక‌.. మ్యాచ్ కి సంబంధించి బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు క్రికెట్ మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకుల కోసం మెట్రో సేవలను కూడా పొడిగించారు. మెట్రో సేవలు ఇవ్వాల అర్ధరాత్రి 1 గంట వరకు అందుబాటులో ఉండనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడం ప్రారంభించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement