Sunday, April 28, 2024

Srinagar: భారీ అగ్ని ప్ర‌మాదం

జమ్ముకశ్మీర్​ ప‌రిధిలోని శ్రీనగర్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్​బాగ్​లోని వాణిజ్య భవనంలో ఈరోజు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ భవనంలోని స్థానికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటినా ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు.. ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ భవనంలోని సిలిండర్​ పేలడంతోనే ఈ ఘటన జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ క్రమంలో మంటలను అదుపుచేస్తుండగా ఒక ఫైర్​ అధికారి గాయపడినట్లు సమాచారం. ఈ భారీ అగ్నిప్రమాద ఘటనలో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement