Tuesday, April 23, 2024

వెబ్ సిరీస్ నిర్మాణంలో – అగ్ర నిర్మాత ‘దిల్ రాజు’

టాలీవుడ్ లో అగ్ర నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు ఈయ‌న వెబ్ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. కాగా డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ తో క‌లిసి ఏటీఎమ్ రాబ‌నీ అనే వెబ్ సిరీస్ ని తీయ‌నున్నారు. ఈ సిరీస్ కి కథను హరీశ్ శంకరే అందిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి ఈ సిరీస్ ను నిర్మించబోతున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. ఈ సిరీస్ కు చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, హరీశ్ శంకర్ కాంబినేషన్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తన తాజా చిత్రం ‘రౌడీ బాయ్స్’ ద్వారా తన సోదరుడి కుమారుడు ఆశిష్ ను దిల్ రాజు వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా అడుగులు వేయాల్సి ఉంటుందని వెబ్ సిరీస్ గురించి పరోక్షంగా దిల్ రాజు వెల్ల‌డించారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్
 పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement