Friday, April 26, 2024

బురఖా వాడకంపై శ్రీలంకలో నిషేధం..

శ్రీలంక ప్రభుత్వం దేశంలో మహిళలు బురఖాలు ధరించడంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. అంతేకాదు వెయ్యి కి పైగా ఉన్న ఇస్లామిక్ పాఠశాలలను కూడా మూసివేయాలని తీర్మానించింది. ఈ నిషేధాజ్ఞలకు సంబంధించిన ఆదేశాలపై తాను సంతకం చేశానని, క్యాబినెట్ ఆమోదం కూడా వచ్చాక నిషేధాన్ని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రజాభద్రత శాఖ మంత్రి శరత్ వీరశేఖర.

అప్పట్లో ముస్లిం మహిళలు, బాలికలు బురఖాలు ధరించేవారు కాదని, ఇస్లాం అతివాదం కారణంగానే బురఖాలు వచ్చాయని అన్నారు. తాము ఈ వైఖరిని తప్పకుండా నిషేధిస్తామని స్పష్టం చేశారు. శ్రీలంకలో బురఖాలపై 2019లో తాత్కాలికంగా నిషేధం విధించారు. అందుకు కారణం నాటి బాంబు పేలుళ్లే. ఈస్టర్ పండుగ సందర్భగా చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తద్వారా ఉగ్రవాద పీడిత దేశాల్లో ఒకటిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement