Sunday, April 28, 2024

జగన్ పెళ్లి రోజు సందర్భంగా భారీ కటౌట్ పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

శనివారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి- వైఎస్ భారతిల 25వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులు జగన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు ఏపీలో ఓ భారీ కటౌట్ సందడి చేస్తోంది. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. జగన్-భారతిల ఫోటోలతో దీన్ని రూపొందించారు. సీఎం జగన్ దంపతులకు విషెస్ చెబుతూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఈ కటౌట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పెళ్లి రోజు సంధ‌ర్బంగా జ‌గ‌న్ దంప‌తులు సిమ్లా టూర్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా సీఎం జ‌గ‌న్ భార‌తి దంప‌తులు అన్యోన్య దంప‌తులుగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో పదో తరగతి ఫలితాల్లో కీలక మార్పులు

Advertisement

తాజా వార్తలు

Advertisement