Sunday, April 28, 2024

విరాట్ కోహ్లీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..

ఎప్పుడు ఏదో వివాదంలో వేలుపెట్టే నటి శ్రీ రెడ్డి లేటెస్ట్ గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసింది. ఇంగ్లండ్ జరిగిన మూడవ టెస్ట్ లో ఓటమిపై కామెంట్ చేస్తూ సారథిగా విరాట్ కోహ్లీ పనికిరాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె.. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కోహ్లీ ఓ చెత్త ఆటగాడని, అతని బ్యాటింగ్ పరమ చెత్తగా ఉందని, రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని కామెంట్ చేసింది. అంతేకాకుండా కోహ్లీ చెత్త పరమ చెత్త ఆటగాడు అంటూ తన ఆగ్రహాన్ని వెల్లగక్కింది.

ఇక శ్రీరెడ్డి అభిప్రాయాన్ని విభేదిస్తూ కోహ్లీ అభిమానులకు రంగంలో దిగగా.. వారికి కూడా ఆమె ధీటుగా బదులిచ్చింది. లార్డ్స్ టెస్ట్ విజయంలో కోహ్లీ పాత్ర లేదా? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఏం లేదని, ఇతరుల క్రెడిట్ కోహ్లీ తీసుకున్నాడని చెప్పింది. ఇక శ్రీరెడ్డి అభిప్రాయంతో రోహిత్ శర్మ అభిమానులు ఏకీభవిస్తున్నారు. హిట్‌మ్యాన్‌కు సారథ్య బాథ్యతలు ఇవ్వాలని చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి ట్వీట్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

https://twitter.com/MsSriReddy/status/1431587982713053186

కోహ్లీ అభిమానులు మాత్రం శ్రీరెడ్డిపై ఫైరవుతున్నారు. అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసని ప్రశ్నిస్తున్నారు. సినీ, రాజకీయాల జోలికి వెళ్లే శ్రీరెడ్డి ఇప్పుడు తన దృష్టిని క్రికెట్ మీద మరల్చిందేందబ్బా? అని సాధారణ క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఇక, కీలకమైన నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఓవల్ వేదికగా జరగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది.

https://twitter.com/MsSriReddy/status/1431595440231706630
Advertisement

తాజా వార్తలు

Advertisement