Friday, May 3, 2024

మూడు రాజధానులకు మోదీ అనుమతిః సీపీఐ

ఏపీ రాజధాని‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రధాని మోడీ ఆమోదం తీసుకున్నాకే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించారని చెప్పారు. మంత్రి బొత్స అవాస్తవాలు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజలను మాయ చేసినట్లు బొత్స అందరనీ మాయ చేయలేరని పేర్కొన్నారు. రైతులను అవమానించేలా మంత్రి బొత్స మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన ఒప్పందాలను  ఈ ప్రభుత్వం గౌరవించదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆరు రూపాయలు ఎక్కువ ధర ఉందన్నారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు. ధర్నా చేసిన సమయంలో వదిలేసి… మరో ఊరిలో అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహంతో పని చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement