Tuesday, May 7, 2024

శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటల సమయం

=తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. కాగా నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 70వేల మంది భక్తులు దర్శించుకోగా 33,092 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.61 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement