Sunday, May 19, 2024

Breaking: ఘోర రోడ్డుప్రమాదం… ఆరుగురు మృతి

గుజరాత్ రాష్ట్రంలో వడోదరాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఓ ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్రక్కును ఓవర్ టేక్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement