Sunday, April 28, 2024

టీడీపీ ఎంపీకి సోనూసూద్ ఆహ్వానం

గతేడాది కరోనా కారణంగా ఎంతోమంది సామాన్య ప్రజలకు సహాయసహకారాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేసి దేవుడయ్యాడు. అయితే ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు ఆయన చేసిన సేవల పట్ల ఆకర్షితుడై సోనూసూద్ చిత్ర పఠాన్ని గీశాడు.

ఇక ఇదే విషయాన్ని చెబుతూ టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఓ ట్వీట్ పెట్టాడు. అయితే దీనిపై స్పందించిన సోనూసూద్… ఆ యువకుడిని తీసుకొని మీరు లంచ్ కి రావాలని ఆహ్వానిస్తూ సోనుసూద్ రిప్లై ఇచ్చారు. అయితే సోనుసూద్ మొదటి వేవ్ లో సహాయం చేసినట్టే సెకండ్ వేవ్ లో కూడా కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నాడు. ఆక్సిజన్ అందక, ఇంజెక్షన్లు కొరతతో ఇబ్బందులు పడుతున్న వారికి బాసటగా నిలుస్తున్నాడు. అలాగే ఆక్సిజన్ ప్లాంట్ లను కూడా నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement