Wednesday, April 24, 2024

అంబులెన్స్ లు ఆపడం పై బిజేపి ఎమ్యెల్యే రాజసింగ్ ఫైర్

హైదరాబాద్ – బోర్డర్ లో అంబులెన్స్ లు ఆపడం పై కెసిఆర్ ప్రభుత్వంపై బిజేపి ఎమ్యెల్యే రాజసింగ్ ఫైర్ అయ్యారు. ఏపీ వారి ఓట్లు కావాలి కానీ.. వాళ్ళకు వైద్యం మాత్రం ఇవ్వరా ? బిజేపి ఎమ్యెల్యే రాజసింగ్ అని తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను ఆపడం సరైన చర్య కాదని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ హైదరాబాద్ ను మెడికల్ హాబ్ అని అంటారు.. హైదరాబాద్ వైద్యం కోసం వస్తే.. నిబంధనలు పెడతారా ? అని నిలదీశారు. ఏపీ నుంచి వచ్చే రోగులను ఆపడం చాలా దారుణమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement