Tuesday, May 14, 2024

స్మార్ట్‌ బాధితులు.. మ‌నుషుల‌ను ముంచుతున్న ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు..

హైద‌రాబాద్‌ (ప్రభన్యూస్) : ఫ్యాక్షనిస్టులకు ఆయుధాన్ని ఆరో వేలుగా పేర్కొంటారు. అదే విధంగా స్మార్ట్‌ ఫోన్‌ అంతే అత్యవసరమైన వస్తువుగా మారినట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకొనే వరకు ఫోన్‌ లేదా ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లతోనే ఎక్కువశాతం మంది కాలం గడుపుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన నాలుగేళ్ల కాలంలో లక్షలాది మందితో వేక్‌ఫిట్‌ సంస్థ నిర్వహించిన అధ్యయనాల్లో నిద్రలేమి పెరిగిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే 16,000 మందికి పైగా ఈ అధ్యయనంలో పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలుస్తోంది.

ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం ఫలితాలు..

హైదరాబాద్‌ మహానగరంలో 94శాతం మంది తమ మొబైల్‌ ఫోన్లలోనే కాలం గడుపుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇదే సంఖ్య 91శాతంగా వేక్‌ఫిట్‌ పేర్కొంది. హోమ్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ అయిన వేక్‌ ఫిట్‌.కో ఇటీవల విడుదల చేసిన తన వార్షిక అధ్యయనం యొక్క నాల్గవ ఎడిషన్‌, గ్రేట్‌ ఇండియన్‌ స్లీప్‌స్కోర్‌ కార్డ్‌(జీఐఎస్‌ఎస్‌) 2021, హైదరాబాద్‌లో 80శాతం మంది పనిలో వారానికి ఒకటి నుండి మూడు రోజులు నిద్రపోతున్నారని ప్రకటించింది. దాదాపు 26శాతం మంది ల్యాప్‌టాప్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌లో అర్థరాత్రి వరకు సినిమాలు చూశామని చెప్పగా, 16శాతం మంది తమ బెడ్‌పై నుంచే ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా పని చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ తరహా పని విధానంతో వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధ పడుతున్న వారి సంఖ్య 40శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 90శాతం మంది రాత్రిపూట కనీసం ఒకటి లేదా రెండుసార్లు మేల్కొంటా మని వెల్లడించారు. ఈ సందర్భంగా వేక్‌ఫిట్‌.కో సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ చైతన్యరామలింగగౌడ మాట్లాడుతూ కరోనా మహమ్మారి అసాధారణ మార్గాల్లో ప్రజలను పరీక్షించిందని, ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి ఏకైక మార్గం తప్పుల నుండి నేర్చుకొని అభివృద్ధి చెందడమేనన్నారు. ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ అభివృద్ధి చెందడం, పనికోసం, సోషల్‌ మీడియాలో కాలక్షేపంతో అనవసరంగా సమయాన్ని స్మార్ట్‌ ఫోన్లలో గడుపుతున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి నూనెను కాల్చే అభివృద్ధి చెందుతున్న మిలీనియల్స్‌ నగరంగా హైదరాబాద్‌ మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సవాలుగా మారుతున్న నిద్రలేమి..

- Advertisement -

ప్రజలు రాత్రిపూట ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లతో ఎక్కువ సమయం గడుపుతుండడంతో నాణ్యమైన నిద్ర ఒక సవాల్‌గా కనిపిస్తోందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మన జీవితాల్లో క్రమరహిత నిద్ర యొక్క దీర్ఘకాలిక పరిణామాలను చూసే ముందు, ఈ సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఎంతై నా ఉందని వైద్య నిపుణులు సైతం పేర్కొంటున్నారు. 2020 నుండి కొన్ని నిద్ర సంబంధిత సమయాలు క్షీణించి నప్పటికీ, ఈ సంవత్సరం జీఐఎస్‌ఎస్‌ 2021 అధ్యయనం ఆరోగ్యకరమైన పని – జీవిత సమతుల్యతను కాపాడుకోవడంలో నిద్ర పాత్ర పెరిగిందని స్పష్టం చేస్తోంది. నిద్ర నాణ్యతను పెంపొందించడంలో 38శాతం మంది మెరుగైన పరుపు తమను గాఢ నిద్రలోకి తీసుకు వెళుతుందని, మరో 32శాతం మంది నిద్రపోయే ముందు ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్‌కు దూరంగా ఉండటం వల్ల వారి నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని, 28శాతం మంది సాధారణ నిద్రవేళలను నిరంతరాయంగా అనుసరించడం వల్ల మెరుగైన నిద్రకు సహాయపడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement