Thursday, May 2, 2024

కేబినెట్‌లో చోటు ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్నా.. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ర‌జినీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ మంత్రివ‌ర్గ‌ పునర్​వ్యవస్థీకరణలో త‌న‌కు చోటు దక్కడంపై గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్‌లోచోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. త‌న‌కు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ బీసీ మహిళకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం, తనకు మంత్రి పదవి అవకాశం కల్పించడం కలలో కూడా ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చినందుకు కష్టపడి ప్రభుత్వానికి, పార్టీ విజయానికి కృషి చేస్తానని అన్నారు .

అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జ‌గ‌న్‌ కేబినెట్‌లో త‌న‌కు అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు ర‌జినీ. కాగా కొత్త మంత్రుల సామాజిక సమీకరణాలు ఇలా ఉన్నాయి. బీసీ నుంచి 10 మంది, కాపు నుంచి 4, రెడ్డి వర్గం నుంచి 4, ఎస్సీ నుంచి 5గురు, ఎస్టీ, మైనార్టీ నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలో తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement