Wednesday, May 1, 2024

National : యుపిలో కారు – ట్ర‌క్కు ఢీ – ఆరుగురు మృతి…

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో శనివారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. కాగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని వారణాసి ట్రామా సెంటర్‌కు తరలించారు. ఆ కుటుంబం బీహార్‌లోని సీతామర్హి నివాసి. అందరూ ఏదో పని నిమిత్తం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కి కారులో వెళ్తుండ‌గా ఎదురుగా వ‌స్తున్న ట్రక్కును ఢీకొట్టింది.

- Advertisement -

గౌరాబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసాద్ తిరాహేలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి 2.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంతలో గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వారణాసిలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. కాగా, మరోవైపు, ట్రక్కు డ్రైవర్, అతని సహచరుడు సంఘటనా స్థలం నుండి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement