Sunday, April 28, 2024

సింగరేణి గ‌నిలో ప్ర‌మాదం..ఇద్ద‌రు మృతి..ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం..

మంచిర్యాల : జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ -3 గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. గనిపై కప్పు కూలడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మొదటి షిఫ్టు లోభాగంగా మైన్ లో బొగ్గు వెలికి తీస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పై కప్పు కూలి బొగ్గు పెల్లలు మీదపడ్డాయి. దీంతో బొగ్గు పెల్లల కింద చిక్కుకున్న ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడగా సింగరేణి రెస్క్యూ సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. బొగ్గు గనిలో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో చాలా వరకు బొగ్గు గనుల్లో ప్రమాదాలు తగ్గాయి అనుకుంటోన్న త‌రుణంలో మ‌ళ్ళీ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం విషాద‌క‌రం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement