Tuesday, May 14, 2024

Sikkim – కార్లపైకి దూసుకెళ్లిన పాల ట్యాంక‌ర్ – ముగ్గురు దుర్మ‌ర‌ణం

సిక్కింలోని రాణిపూల్‌ సంతలో నిన్న అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. ఓ స్టాల్ వద్ద తంబోలా ఆడుతున్న జనంపైకి సిక్కిం మిల్స్ యూనియన్ సంస్థకు చెందిన పాల ట్యాంకర్ ఒక్కసారిగా దూసుకొచ్చి అక్కడే ఉన్న మూడు కార్లను సైతం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన తీరు అక్కడే ఉన్న ఓ సీసీ టీవీలో రికార్టు కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement