Saturday, April 27, 2024

సింగరేణి ఉద్యోగులపై వరాలు కురిపించిన బోర్డు

సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. గతంలో ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్లు ఉండగా.. తాజాగా 61 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ శ్రీధర్ సోమవారం నాడు 557వ బోర్డు డైరెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ ఏడాది మార్చి 31 నుంచి ఉద్యోగులకు పదవీ విరమణ పెంపు అమలు చేయనున్నారు. దీనివల్ల 43,899 మంది లబ్ధి చేకూరనుంది. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సింగరేణి బోర్డు నిర్ణయించింది. 2021-22 ఏడాదికి సీఎస్‌ఆర్ ఫండ్‌ కోసం రూ.61 కోట్లు కేటాయించింది. మరోవైపు సింగరేణి నిర్వాసిత కాలనీలకు సంబంధించి 201 ప్లాట్లు కేటాయించాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కారణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇప్పటివరకు కేవలం కుమారులకు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే అవకాశం కల్పిస్తుండగా.. కార్మికుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు పెళ్లయిన, విడాకులు తీసుకున్న విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడి ఉన్న కుమార్తెలు, ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ వయోపరిమితికి లోబడి వారసత్వ ఉద్యోగం పొందేందుకు బోర్డు ఆమోదం పలికింది.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement