Thursday, May 9, 2024

తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

తెలంగాణలో వరుస ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనలు రేకేత్తిస్తున్నాయి. గత పది రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురికాగా.. సోమవారం ఉదయం తూప్రాన్‌లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు మూర్చ రావడంతో బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సు ఆగిపోయిన సమయంలో 70 మంది ప్రయాణికులున్నారు. ఎవ్వరికీ ఎలాంటి హానీ తలెత్తకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్‌లో గంట వ్యవధిలో రెండు చోట్ల చోరీలు

Advertisement

తాజా వార్తలు

Advertisement