Friday, April 26, 2024

హైదరాబాద్‌లో గంట వ్యవధిలో రెండు చోరీలు

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఓ ఇంటి కిటికీలు పగులగొట్టి లోపలకు ప్రవేశించిన దొంగలు.. ఇంట్లోని రూ.80వేలు నగదు దోచుకెళ్లారు. మరోవైపు గాజులరామారం డివిజన్ శ్రీరాంనగర్‌లోని వినాయకుడి ఆలయంలో వినాయక విగ్రహం, దుర్గామాత విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ రెండు విగ్రహాలు కలిపి సుమారు కిలో వెండి వరకు ఉంటుందని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. గంట వ్యవధిలో నగరంలో రెండు చోట్ల చోరీలు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: ‘రంగం’లో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

Advertisement

తాజా వార్తలు

Advertisement