Friday, April 26, 2024

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇప్ప‌టికే జ‌గ‌న్ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌గా లిఖితపూర్వక వాదనలను సీబీఐ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. సీబీఐకి ఇప్ప‌టికే కోర్టు ఈ కౌంట‌ర్ వేసేందుకు చివ‌రి అవ‌కాశం ఇచ్చింది.

అయినా సీబీఐ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేదు. త‌మ‌కు జ్వ‌రంగా ఉన్నందున విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని, కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని సీబీఐ లాయ‌ర్లు కోర్టును కోరారు. దీంతో సీబీఐ కోర్టు ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో సెంచరీ దాటిన డీజిల్ ధర

Advertisement

తాజా వార్తలు

Advertisement