Friday, April 26, 2024

లూసిఫర్ రీమేక్ కు ముహూర్తం కుదిరింది

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి నటించబోతున్నాడు. అలాగే వేదాళం రీమేక్ సినిమాలో కూడా నటించబోతున్నాడు. అయితే లూసిఫర్ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ ను వచ్చేనెల ఆగస్టు 12 నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన మోహన్ రాజా మెగాస్టార్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు.

ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ నేతృత్వంలో ఈ సినిమా షూటింగ్ కోసం భారీ ఎత్తున సెట్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇక తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి చిరంజీవి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేసాడట మోహన్ రాజా. ఈ సినిమాలో మెగాస్టార్ సోదరిగా సీనియర్ నటి సుహాసిని నటించబోతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement