Saturday, May 4, 2024

ద్వార‌కామాయిని తెర‌వ‌కుంటే ఆందోళ‌న చేస్తా.. శివ‌సేన కార్య‌క‌ర్త క‌మ‌లాక‌ర్ కోటే

షిరిడీ సాయి భ‌క్తుల‌కు సాయి స‌మాధిని ద‌ర్శించుకునే భాగ్యం క‌ల్పించాల‌ని, ద్వారకామాయిని ఓపెన్ చేయాల‌న్నారు శివ‌సేన లీడ‌ర్ క‌మ‌లాక‌ర్ కోటే. ఈ విష‌య‌మ్మీద షిరిడీ సంస్థాన్ ట్ర‌స్ట్ చొర‌వ‌చూప‌కుంటే ఉద్య‌మం చేయాల్సి వ‌స్తుంద‌న్నారు. అంతేకాకుండా సీఎం షిండేను క‌లిసి ఫిర్యాదు చేస్తాన‌ని తెలిపారు. ఈ విష‌యంలో ఔరంగాబాద్‌, అజింక్యా కోర్టుల‌లో పిటిష‌న్ దాఖ‌లు చేస్తాన‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికైనా సాయి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నంలో ఇబ్బందులు లేకుండా చూడాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement