Wednesday, May 1, 2024

కష్టాల్లో ఉన్నవారికి అండగా కేసీఆర్‌ భరోసా.. డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్‌

పెద్దపల్లి,  (ప్రభన్యూస్‌): తెలంగాణ రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న వారందరికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 41 మంది డయాలసిస్‌ రోగులకు ఆసరా పెన్షన్‌ కార్డులను ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులతోపాటు అనారోగ్యంతో బాధ పడుతున్న డయాలసిస్‌ రోగులను సైతం పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలోనే ఇలాంటి పథకాలు అమలవుతున్నాయని ప్రజలంతా గుర్తించాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement