Sunday, April 28, 2024

Shamirpet – ఓఆర్‌ఆర్‌పై లారీ బీభత్సం – రెండు కార్లు నుజ్జు..నుజ్జుః ముగ్గురు దుర్మ‌ణం

హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై లారీ బీభత్సం సృష్టించింది. శామీర్‌పేట-కీసర మధ్య ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బొలెరో , టాటా టియాగో కారును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు క్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు, లారీ ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు ఈ దుర్గాటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్కేసర్ నుండి మేడ్చల్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ పైనుండి ఎగిరి ఎదురుగా వస్తున్న బొలెరో ట్రాలీ, కారును డీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికకడే మృతి చెందారని తెలిపారు. బొలెరో కారులో నలుగురు వ్యక్తులు ఉండగా అందులో ఇద్దరు మరణించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీలో ఇద్దరు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరేకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్షతగాత్రులను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. మృతుల, క్షేత్తగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదంతో ఓఆర్‌ఆర్‌పై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించిన సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement