Saturday, May 4, 2024

శాలిమార్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు.. తృటిలో తప్పిన ప్రమాదం..

శాలిమార్ ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. మహా రాష్ట్రలోని నాసిక్‌ ఏరియాలో ఇవాళ ఉదయం 8.43 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని లగేజ్ కంపార్టు మెంట్ నుంచి ద‌ట్ట‌మైన పొగ‌లు రావ‌డాన్ని గ‌మ‌నించిన లోకో పైలెట్ రైలును అక్క‌డే నిలిపివేశాడు. వెంట‌నే రైల్వే అధికారులు స‌మాచారం అందించారు. రైలు నుంచి మంట‌లు చెల‌రేగిన ల‌గేజ్ కంపార్ట్ మెంట్ ను ప్ర‌యాణికులు ప్ర‌యాణించే బోగీల నుంచి వేరు చేశారు. బోగీలో వ్యాపించిన మంట‌ల‌ను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అనంత‌రం ప్ర‌యాణికుల బోగీల‌ను సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానానికి త‌ర‌లించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని రైల్వే ఉన్న‌తాధికారులు అంటున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement