Thursday, April 25, 2024

Breaking : తీవ్ర అస్వస్థతకి గురయిన.. ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

ఫుడ్ పాయిజన్ తో ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. మెస్‌లో చపాతి తిన్న విద్యార్థులు అర్ధరాత్రి నుంచి వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. పదుల సంఖ్యలో విద్యార్థలు బాధపడుతున్నా సకాలంలో కళాశాల అధికారులు స్పందించకపోవడంతో బాధపడుతున్న విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది . అస్వస్థతకు గురైన విద్యార్థులను కొందరిని స్థానికంగా చికిత్స అందించగా మరికొందరిని శనివారం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement