Monday, April 29, 2024

“శాకిని డాకిని” థ్రిల్​ చేసేందుకు రెడీ.. త్వరలోనే థియేటర్లలో రిలీజ్​

రెజీనా కసాండ్రా, నివేదా థామస్ క‌లిసి న‌టిస్తున్న‌ తెలుగు యాక్షన్ మూవీ ‘‘శాకిని డాకిని’’.. కొరియన్ మూవీ అయిన మిడ్‌నైట్ రన్నర్స్ ని రీమేక్ వర్షన్​ అయిన ఈ స‌నిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా 2022 సంక్రాంతి స‌మయంలోనే విడుద‌ల కావాల్సింది.. కొన్ని కారాణాలతో విడుద‌ల తేదీని పోస్ట్ పోన్ చేసింది మూవీ టీమ్..

అయితే.. తాజాగా కొద్దిసేప‌టి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్ ను విడుద‌ల చేసింది సినిమా బృందం. ఈ సినిమాని వ‌చ్చే నెల (సెప్టెంబ‌ర్) 16వ తేదీన థీయేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఒక అఫీషియ‌ల్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాలో.. పోలీస్ అకాడమీలోని ఇద్దరు విద్యార్థులు, హ్యూమెన్ ట్రాఫికింగ్ చేసే ముఠాను ఎలా ఛేదించారు అనే స్టోరీ లైన్ పై ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే.. ఈ కొరియ‌న్ మూవీలో ఇద్దరు హీరోలు ప్రధాన పాత్రలో నటించింగా.. తెలుగు రీమేక్ వ‌ర్ష‌న్ లో ఫీమేయిల్ లీడ్ క్యారెక్టర్స్ తో.. రెజీనా, నివేథా ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement