Wednesday, May 15, 2024

500మందితో ర్యాలీ-పాల్గొన్న ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త‌

దిల్ సుఖ్ నగర్, కొత్తపేటలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సామూహిక లలితా పారాయణం మణిద్వీప వర్ణనా పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళ విభాగం ఆధ్వర్యంలో సామూహిక లలితా పారాయణం మణిద్వీప వర్ణనా పూజ నిర్వ‌హించారు. 75వ‌ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలపన చేసి, దాదాపు 500 మందితో వీధుల గుండా ర్యాలీలో పాల్గొన్నారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.ఈ కార్యక్రమంలో పబ్బ చంద్రశేఖర్, బచ్చు శ్రీనివాస్, అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, జనరల్ సేకరెట్రీ మంజుల, సుజాత, లలిత, సరోజ, మంజుల, సత్యలక్ష్మి, మల్లిక, సరిత, ivf నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement