Monday, May 13, 2024

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురు మృతి..

బీద‌ర్ : ఆటో, లారీ ఢీకొన్ని ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతి చెందిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్ లో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. బీదర్‌లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ ఢీకొట్ట‌డంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతించారు. మ‌రికొంత‌మందికి గాయాలు కాగా.. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారంతా కూలీలని, పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement