Sunday, April 28, 2024

పావన ద్వాదశి

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తికం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడే కార్తిక శుక్షపక్ష ద్వా దశి. ఈ ద్వాదశి శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఇది క్షీరాబ్ది ద్వాదశిగా ప్రసిద్ధి పొందింది. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తా డుగా క్షీర సముద్రాన్ని దేవదానవులు మధించిన రోజు ఇది. అందుకే దీన్ని ‘క్షీరాబ్ది’ ద్వాదశి అన్నారు. మధించడం అంటే చిలకడం. కాబ ట్టి ‘చిలుకు ద్వాదశి’గా కూడా వ్యవహరిస్తారు. అమృతం కోసం దేవ తలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది. స్వాయంభువ మన్వాది సం వత్సరాలను క్షీరాబ్ది ద్వాదశి రోజు నుంచి లెక్కిస్తారు.
‘ఏకాదశి నుంచి పూర్ణిమ వరకూ ‘భీష్మ పంచక వ్రతం’ అని శా స్త్రాలు చెబుతున్నాయి. మరణశయ్యపై ఉన్న పితామ#హుడు భీష్ముని దాహార్తి తీర్చడానికి అర్జునుడు తన బాణంతో పాతాళగం గను పైకి రప్పించినది ఈ రోజునేనని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహా విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశినాడు శ్రీ#హరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని ‘బృందావని ద్వాదశి’గా పిలుస్తారు.
క్షీరాబ్ది ద్వాదశి నాడు పాల సముద్రంలో మహాలక్ష్మి ఆవిర్భవిం చిందనీ, ఆ రోజునే లక్ష్మీ నారాయణుల కల్యాణం జరిగిందనీ ‘చతు ర్వర్గ చింతామణి’ అనే గ్రంథం చెబుతోంది. అందుకే ఈ రోజు లక్ష్మీ నారాయణ కల్యాణం నిర్వహంచే సంప్రదాయం ఏర్పడింది.
విష్ణుమూర్తినీ, మహాలక్ష్మినీ బృందావనానికి బ్రహ్మ తీసుకొని వె ళ్ళి, అక్కడ తులసితో విష్ణువుకు వివాహం జరిపించాడని క్షీరాబ్ది వ్రత కథ చెబుతోంది.
లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయ మాడిన శుభ తిథి కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తుల సీని శ్రీలక్ష్మీగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలం కరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం, ఈరోజు దీపారాధన చేయడంవల్ల పరిహారమౌతుంది.
పరమ పవిత్రమైన ఈ రోజును పావన ద్వాదశిగా, విభూతి ద్వా దశిగా, గోవత్స ద్వాదశిగా, నీరాజన ద్వాదశిగా వ్యవహరిస్తూ… అం దుకు సంబంధించిన వ్రతాలు చేస్తుంటారు. తులసి సాక్షాత్తూ లక్ష్మీ దేవి అంశే. ముఖ్యంగా, మధురలోని బృందావనంలో, మహారాష్ట్ర లో క్షీరాబ్ది ద్వాదశినాడు తులసీ కల్యాణం నిర్వహస్తారు.
తెలుగు లోగిళ్ళలో క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం తులసి కోట దగ్గర అలికి, ముగ్గులు పెడతారు. తులసికోటనే బృందావనం గా భావించి, ఉసిరిక కొమ్మను విష్ణుమూర్తికి ప్రతీకగా సంభావించి… తులసీ కల్యాణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని గృహణి లేదా దంపతు లు నిర్వహస్తారు. రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి… ఇలా ఎ న్నో రకాల తులసి చెట్లు ఉన్నాయి. నల్లని కాండం ఉన్న మొక్కను ‘కృష్ణ తులసి’ అనీ, తెల్లని కాండం ఉండే మొక్కను ‘లక్ష్మీ తులసి’ అనీ అంటారు. ఈ రెండు వర్ణాల తులసి వృక్షాలను తులసికోటలో నాటి, పరిణయం జరిపిస్తారు.
దశావతారాల్లో ఎనిమిదవది శ్రీకృష్ణావతారం. తులసి సన్ని ధిలో ఉండడం తనకెంతో ఇష్టమని సాక్షాత్తూ కృష్ణుడే తన సహపాఠి ఉద్ధవునితో చెప్పినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. తులసితో కృష్ణు నికి ఉన్న అనుబంధమే తులసీ కల్యాణం నిర్వహంచడానికి ముఖ్య కారణం. ఈ కల్యాణం సందర్భంగా తులసిని షోడశోప చారాలతో పూజించి, వివిధ రకాల పండ్లు, చెరుకు ముక్కలు, చలిమిడి, వడప ప్పు నివేదించి హారతి ఇస్తారు. ముత్తైదువును శ్రీమహాలక్ష్మిగా సంభా వించి, పసుపు కుంకుమలు, ఫల పుష్ప తాంబూలాదులతో సత్కరిం చి, దీవెనలు పొందుతారు. అలా చేస్తే మాంగల్యాభివృద్ధి కలుగుతుం దని నమ్మకం. రోజంతా ఉపవసించిన గృహణులు పూజానంతరం తులసికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకొని, ఉపవాసాన్ని విరమిస్తారు.
ప్రతిరోజూ ఉభయ సంధ్యలలో దేవుని ముందు దీపాలు వెలిగిం చడం మన సంస్కృతిలో భాగం. అలా పెట్టలేనివారు కార్తిక మాసం లోనైనా పెట్టాలని శాస్త్రాలు అంటున్నాయి. అది కూడా చేయలే నివారు ద్వాదశినాడు 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే, సంవ త్సరమంతా దీపం వెలిగించినట్టవుతుందని శాస్త్ర వచనం. కార్తి కమాసం అంతా దీపాలు పెట్టలేనివారు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ నాడు తప్పకుండా పెట్టాలనీ, అందునా ద్వాదశి నాటి దీపం వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుందనీ ‘కార్తిక పురాణం’ చెబుతోంది.
హందూ సంస్కృతిలో తులసి అతి పవిత్రం. తులసీ కృష్ణుల అనుబంధం కూడా అటువంటిదే. తులసికోట లేని ఇల్లంటూ ఉండ దు. మహళలు తులసిని ప్రతిరోజూ పూజిస్తారు. తులసికి నీరు పోసి, దీపం పెట్టి, తులసీ స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేసి, చివరగా తులసి కోటలోని తీర్థాన్నీ, తులసీ దళాన్నీ స్వీకరిస్తారు. తులసిని పూజించ డం అంటే లక్ష్మిని ఆరాధించడమే. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసీ ధాత్రీ సహిత లక్ష్మీ నారాయణులకు చేసే పూజ. ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఆరాధన ప్రేమకూ, భక్తికీ, ప్రతీక. తులసి తీర్థం, తులసీ దళం మీదుగా వచ్చే గాలి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తులసిలో రోగనివా రకశక్తి ఉందని ఆయుర్వేదం నిరూపించింది.
చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమ యంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణ లిఖితం. గోవత్స ద్వాద శి’గా పిలిచే ఈ రోజున వత్సంతో అంటే దూడతో కూడిన ఆవును దానం ఇస్తే విశేష ఫలం లభిస్తుందని ఆస్తికుల విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement