Thursday, May 9, 2024

పెట్టుబడి రూ.100.. గెలుచుకుంది రూ.కోటి

అదృష్టం ఎవరిని ఎప్పుడు.. ఎలా వరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఏమో ఒక్కరాత్రిలో కూడా లైఫ్ మారిపోవచ్చు. పంజాబ్‌లో ఒక మహిళకు ఇలానే అదృష్టం వరించింది. మోగా జిల్లాలోని బాఘపురానకు చెందిన 61 ఏళ్ల ఆశా స్క్రాప్ షాప్ నిర్వహిస్తుంది. ఆమె ఇద్దరు కుమారులు అదే షాపులో పనిచేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆశా పంజాబ్ ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర లాటరీల శాఖలో రూ.100 ఖర్చు పెట్టి లాటరీ టిక్కెట్ కోనుగోలు చేసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆశాకు బంపర్ ఆఫర్ తగిలింది. రూ. 100 ఖర్చు చేసిన కొన్న లాటరీ టికెట్‌తో రూ.కోటిని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వ లాటరీ విభాగం అధికారులు ఆశాకు రూ.కోటి ఇచ్చేందుకు ఫార్మాలిటీస్‌ను పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆశా మాట్లాడుతూ.. తనకు కోటి రూపాయల లాటరీ తగులుతుందని అస్సలు ఊహించలేదని.,. వచ్చిన డబ్బులతో తనకున్న అప్పులన్నీ తీర్చేసి ఇల్లు కట్టుకుంటానని ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement