Saturday, April 27, 2024

నేడు మరో 15 స్కూల్ బస్సులు సీజ్

కరోనా కారణంగా ఏడాదిన్నర తర్వాత విద్య సంస్థలు తెరుచుకోవడంతో ఫిటినెస్ లేని స్కూల్ బస్సులపై అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో నిన్న 12 స్కూల్ బస్సులను సీజ్ చేసిన అధికారులు ఇవాళ మరోసారి తనిఖీలు నిర్వహించి మరో 15 బస్సులను సీజ్ చేశారు. నార్సింగీ, కొండాపూర్, చేవెళ్ళతో పాటు శంషాబాద్ లో తనిఖీలు నిర్వహిస్తుంది అధికారుల బృందం. అయితే నిన్న 12 బస్సులను సీజ్ చేసిన అధికారులు నేడు నిబంధనలు పాటించని మరో స్కూల్ 15 బస్సులను సీజ్ చేసారు రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు. స్కూల్ బస్సులకు సంబంధించి ఫిట్‌నెస్, రోడ్డు ట్యాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్స్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు విద్యార్థుల సామర్ద్యం పై ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు.

ఇది కూడా చదవండి: Tollywood drug case: ఈడీ విచారణకు హాజరైన చార్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement