Thursday, April 18, 2024

తండ్రి బాటలో సీఎం జగన్‌: సజ్జల

ఏపీ సీఎం జగన్ తండ్రి బాటలో పయనిస్తున్నారని ఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పాలకుడు ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్‌ అని కొనియాడారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ 12వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆచరణల్లోంచి ఓ మహావృక్షం పెరిగిందన్నారు. నాన్న వేసిన అడుగుకి పదడుగులు వైఎస్‌ జగన్‌ వేశారన్నారు. వైఎస్సార్‌ ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా వైఎస్‌ జగన్‌ పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ను బలోపేతం చేస్తూ ఆయన అడుగులో అడుగు వేద్దామని కార్యకర్తలకు సజ్జల పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: తండ్రి వైఎస్ ను తలుచుకుంటూ జగన్ భావోద్వేగ ట్వీట్

Advertisement

తాజా వార్తలు

Advertisement