Thursday, May 9, 2024

TS | నిజామాబాద్ సీపీగా సత్యనారాయణ.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్​ శాంతికుమారి

నిజామాబాద్ పోలీస్​ కమిషనర్​గా సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇవ్వాల (శుక్రవారం) రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ ప్రస్తుతం రాచకొండ జాయింట్ సీపీగా పనిచేస్తున్నారు. గతంలో రామగుండం, కరీంనగర్ పోలీస్​ కమిషనర్​గా ఆయన పని చేశారు. ఆరు నెలలుగా నిజామాబాద్ పోలీస్​ కమిషనర్​గా ప్రభుత్వం ఎవరినీ నియమించక పోవడం వల్ల ఇన్​చార్జి పాలన సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్​ కమిషనర్​గా సత్యనారాయణను ప్రభుత్వం నియమించినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement