Monday, April 29, 2024

Big Story | అమితంగా జంక్‌ ఫుడ్‌ తింటున్న‌ తెలంగాణ ప్రజలు.. ఇక్రిసాట్‌ అధ్యయన నివేదిక వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కార్బోహైడ్రెడ్లు, షుగర్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తెలంగాణ ప్రజలు అమితంగా తీసుకుంటున్నట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో అధిక బరువు, ఊభకాయంతో బాధపడేవారి సంఖ్య నానాటీకి పెరిగిపోతోంది. ఈ అంశాలను ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెమీ అరిడ్‌ ట్రాపిక్స్‌ (ఇక్రిసాట్‌) నివేదిక బహిర్గతం చేసింది. ఈ పరిణామానికి ప్రజలు అధిక మొత్తంలో కార్బోహైడ్రెడ్లు, షుగర్‌ ఉన్న ఆహారం తీసుకోవడమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆగస్టు 30న ఇక్రిసాట్‌ అధ్యయన నివేదికను విడుదల చేసింది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రోటీన్‌, అన్ని రకాల పోషకాలు లభించే ఆహారం కంటే కార్బోహైడ్రెట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇంకా ఆరోగ్యవంతమైన పండ్లు, కూరగాయల కంటే మాల్స్‌లో రెడిమేడ్‌గా దొరికే ఫుడ్స్‌ని ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది పోషకాహార లోపానికి ప్రధాన కారణంగా మారుతోంది.

- Advertisement -

ప్రోటీన్‌ లేని ఆహారం తింటే సమస్యలు, సాంప్రదాయ ఆహారం, ఫుడ్‌ సప్లయ్‌ చెయిన్స్‌ ప్రాముఖ్యత గురించి కూడా ఇక్రిసాట్‌ నివేదికలో ప్రస్తావించింది. పోషకాహార లోపం, ఒబేసిటీ సమస్యలకు గల కారణాలను వెలుగులోని తీసుకురావడం భారతదేశ గ్రామీణ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కోసం సహాయపడుతుందని ఇక్రిసాట్‌ భావిస్తోంది. ఇక్రిసాట్‌ నివేదిక నేపథ్యంలో ఒబేసిటీ లేదా అధిక బరువు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఒబేసిటీ కారణంగా టైప్‌-2 డయాబెటీస్‌, హై బీపీ, హృదయ సంబంధిత సమస్యలు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, ఫ్యాటీ లివర్‌ సమస్య, పెద్దపేగు క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, యుటరస్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, గాల్‌బ్లాండర్‌ క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ సాంప్రదాయబద్దమైన, ఇంటి ఫుడ్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్రిసాట్‌ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement