Sunday, April 28, 2024

PBKS vs DC | సామ్ క‌ర్ర‌న్ విధ్వంసం.. ఢిల్లీపై పంజాబ్ విజ‌యం

ఐపీఎల్ 2024 17వ సీజ‌న్‌లో భాగంగా చంఢీగర్ లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. పంజాబ్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాగా, చేజింగ్‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపొందింది.

యంగ్ ప్లేయర్ సామ్ కర్రన్ ధీటుగా ఆడుతూ 63 పరుగులతో టోర్నీలో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక, శికర్ ధవన్ (22), ప్రభసిమ్రాన్ సింగ్ (26), లియామ్ లివింగ్‌స్టోన్ (38) పరువాలేదనిపించారు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ చరో రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ప్రారంభంలో ధాటిగా ఆడిన ఢిల్లీ.. మధ్యలో వరుస వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అక్షర్ పటేల్(21), అభిషేక్ పోరెల్(32) ధనాధన్ ఇన్నింగ్ తో జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా అభిషేక్ బౌండరీలతో చెలరేగి.. పంజాబ్ బౌలర్లకు ధీటైన సమాధానం చెప్పాడు. ఇక, పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, అర్షత్ పటేల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రబాడ, హర్ ప్రీత్, రాహుల్ చాహర్ లు తలో వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement